తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-09-25T14:45:22+05:30 IST
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,381 కరోనా కేసులు నమోదు అవగా... 10 మరణాలు సంభవించాయి.
![తెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020092509140858/09252020091454n72.jpg)
హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,381 కరోనా కేసులు నమోదు అవగా... 10 మరణాలు సంభవించాయి. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,627కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,021 మంది, ఇప్పటి వరకు 1,50,160 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటి వరకు 1,080 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 30,387 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే జీహెచ్ఎంసీలో కొత్తగా 386, రంగారెడ్డి 227, మేడ్చల్ 193, నల్గొండ 132, కరీంనగర్లో 119 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.