తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ
ABN , First Publish Date - 2020-04-02T00:36:46+05:30 IST
కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు చేయూత అందించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ వచ్చి పడుతోంది.

హైదరాబాద్: కరోనా కట్టడికి ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలకు చేయూత అందించేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. తెలంగాణ సీఎం సహాయనిధికి విరాళాల వెల్లువ వచ్చి పడుతోంది. అరబిందో ఫార్మా రూ.7.5 కోట్లు, రూ.3.25 కోట్ల విలువైన శానిటైజర్లు, మందులు విరాళమిచ్చారు. గ్లాండ్ ఫార్మా రూ.కోటి విరాళమిచ్చింది. నవభారత్ వెంచర్స్ రూ.2.5 కోట్లు, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ రూ.50 లక్షలు, మధ్యాహ్న భోజనం కార్మికులు రూ.2.65 కోట్లు విరాళమిచ్చారు.
మంగళవారం ప్రగతిభవన్లో పారిశ్రామిక వేత్తలు, మంత్రి కేటీఆర్ను కలిసి, సీఎంఆర్ఎఫ్కు విరాళాలు అందజేశారు. దివీస్ లేబొరేటరీస్ రూ.5 కోట్లు, గ్రాన్యూల్స్ ఇండియా రూ. కోటి, విర్కో పెట్రో కెమికల్స్ రూ.కోటి, ఐఆర్ఏ రియాల్టీ టెక్నాలజీ రూ. 25 లక్షలు, సుచిర్ ఇండియా రూ.25 లక్షలు, ఎంజీబీ కమొడిటీస్ రూ.20 లక్షలు, మానవీయ డెవల్పమెంట్ అండ్ ఫైనాన్స్ రూ.20లక్షలు, సాయిసూర్య డెవలపర్స్ రూ.10 లక్షలు అందజేశాయి.