టీఆర్ఎస్ ఆవిర్భావం నేపథ్యంలో తెలంగాణ భవన్లో..
ABN , First Publish Date - 2020-04-27T01:44:05+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.

హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను తెలంగాణ సర్కారు కఠినంగా అమలు చేస్తోంది. టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో గదులను హైపో క్లోరైడ్తో మేయర్ బొంతు రామ్మోహన్ క్లీన్ చేయించారు. సోమవారం టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ జెండా ఎగురవేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.