నిరుద్యోగులకు తీపి కబురు

ABN , First Publish Date - 2020-12-13T22:13:55+05:30 IST

ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

నిరుద్యోగులకు తీపి కబురు

హైదరాబాద్: ఎన్నో ఏళ్లుగా నిరుద్యోగులు ఉద్యోగ నోటిఫికేషన్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. నిరుద్యోగులందరికీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది.  ఖాళీగా ఉన్న పోస్టులను  వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వ నిర్ణయం తీసుకొంది. ఈ మేరకు ఆయా శాఖల్లో ఖాళీలను గుర్తించాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ, పోలీసులతో పాటు ఖాళీ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్లు  వెలువడనున్నాయి.  వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం.


ఆ పోస్టులన్నీంటిని వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణలో కొన్ని వేలమంది నిరుద్యోగులు ఈ నోటిఫికేషన్ కోసం  అత్రుతగా ఎదురుచూస్తున్నారు. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉంది. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అలాగే ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో  వెంటనే సమాచారాన్ని సేకరించాలని ప్రభుత్వం ఆదేశించింది. 

Updated Date - 2020-12-13T22:13:55+05:30 IST