ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న, జలగం సుధీర్
ABN , First Publish Date - 2020-09-24T08:48:44+05:30 IST
ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న, జలగం సుధీర్
![ఎమ్మెల్సీ బరిలో తీన్మార్ మల్లన్న, జలగం సుధీర్](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
హైదరాబాద్, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తామూ పోటీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు జర్నలిస్టు తీన్మార్ మల్లన్న (నవీన్ కుమార్), నల్లగొండకు చెందిన సామాజిక కార్యకర్త జలగం సుధీర్ స్పష్టం చేశారు. తాను మరోసారి వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానం నుంచి పోటీ చేయబోతున్నానని మల్లన్న ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, నల్లగొండ స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించాలని మంత్రి కేటీఆర్ను జలగం సుధీర్ కోరారు.