‘ధరణి’లో సాంకేతిక సమస్యలు
ABN , First Publish Date - 2020-11-21T10:08:24+05:30 IST
‘ధరణి’లో సాంకేతిక సమస్యలు

వ్యవసాయేతర ఆస్తుల ట్రయల్ రన్
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి అధికారులు శుక్రవారం బీఆర్కే భవన్లోని వార్ రూమ్లో ధరణి పోర్టల్ ట్రయల్ రన్ నిర్వహించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి కొంత మంది వ్యక్తుల పేర్లు, ఆస్తుల డోర్ నెంబర్లు, డాక్యుమెంట్ల స్కానింగ్ కాపీల వంటివాటిని ఎంట్రీ చేయడానికి ప్రయత్నించారు. కానీ, ఫైళ్లు సేవ్ కావడం లేదని తెలిసింది. అన్ని వివరాలు అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ కొడితే ‘ఎర్రర్’ అని చూపిస్తున్నట్లు సమాచారం. ఇలాంటి చిన్న చిన్న సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తూ నవంబరు 23 నాటికి ధరణి పోర్టల్ను సిద్ధం చేయనున్నట్లు తెలిసింది. నవంబరు 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.