టీచర్లు ఆత్మహత్యలు చేసుకోవద్దు: రమణ
ABN , First Publish Date - 2020-12-20T19:16:28+05:30 IST
ప్రభుత్వం ఎవరిని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: ప్రభుత్వం ఎవరిని ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ వ్యాఖ్యానించారు. ఎంతో మందిని తీర్చిదిద్దిన టీచర్లను టీఆర్ఎస్ ప్రభుత్వం రోడ్డు మీద పడేసిందని మండిపడ్డారు. టీచర్లు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ధైర్యం చెప్పారు. పోరాటాలతో ఏదైనా సాధించుకోవచ్చని సూచించారు. సీఎం కేసీఆర్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగి పోయారని అన్నారు. టీఆర్ఎస్ నాయకుల డ్రామాలను ప్రజలు నమ్మడం లేదని రమణ తెలిపారు.