వచ్చేవారం టీడీపీ రాష్ట్ర కమిటీ

ABN , First Publish Date - 2020-08-16T10:28:14+05:30 IST

టీడీపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి వచ్చిన మరికొన్ని ప్రతిపాదనలనూ పరిశీలించాలని...

వచ్చేవారం టీడీపీ రాష్ట్ర కమిటీ

  • తాజా ప్రతిపాదనలూ పరిశీలించండి
  • ముఖ్యులతో చంద్రబాబు 

హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): టీడీపీ రాష్ట్ర కమిటీకి సంబంధించి వచ్చిన మరికొన్ని ప్రతిపాదనలనూ పరిశీలించాలని రాష్ట్ర పార్టీ ముఖ్యులను  అధినేత చంద్రబాబునాయుడు ఆదేశించారు. రెండు మూడురోజుల్లో కమిటీపై సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఎల్‌.రమణకు సూచించారు.   కొత్త కమిటీని వచ్చే వారమే చంద్రబాబు ప్రకటించనున్నారు. పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో చంద్రబాబు శనివారం జూమ్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు.  కమిటీ కూర్పునకు జరిగిన కసరత్తును నేతలు ఆయనకు వివరించారు. గిరిజనులు, చేనేత కార్మికుల సమస్యలపై చేపట్టనున్న కార్యక్రమాలను పార్టీ అనుబంధ విభాగాల నాయకులు తెలియజేశారు. రెండు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.  ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రజల కన్నా వారి రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని టీడీపీ నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు.  

Updated Date - 2020-08-16T10:28:14+05:30 IST