యూపీ వలస కుటుంబాలకు రావుల ఆర్థిక సాయం
ABN , First Publish Date - 2020-03-30T17:59:56+05:30 IST
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ వలస కుటుంబాలకు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి బాసటగా నిలిచారు.
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ వలస కుటుంబాలకు టీటీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి బాసటగా నిలిచారు. లాక్డౌన్తో వనపర్తిలో ఇబ్బంది పడుతున్న ఐస్క్రీమ్ అమ్ముకొని బతికే వారికి నిత్యావసర వస్తువుల కోసం ఆర్థిక సాయం అందించారు. 30 కుటుంబాలకు 2వేల రూపాయల చొప్పున అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రావుల స్వయంగా వెళ్లలేకపోవటంతో.. నాగర్ కర్నూల్ టీడీపీ నాయకులు బి.రాములు, అశోక్ ద్వారా సాయం అందజేశారు.