కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం: తమ్మినేని

ABN , First Publish Date - 2020-07-14T09:03:51+05:30 IST

కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయని సీపీఎం

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం: తమ్మినేని

హైదరాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్‌సను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించారు. ఇందుకు నిరసనగా ఈనెల 16న రాష్ట్రంలోని జిల్లా, మండల కేంద్రాల్లోని ఆస్పత్రుల వద్ద సత్యాగ్రహ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సుమారు రెండు నెలల లాక్‌డౌన్‌ కాలాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకోలేదని విమర్శించారు. వైరస్‌ సోకిన వారికి సరైన వసతులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు ఇష్టమొచ్చినట్టు ఫీజులు వసూలు చేస్తున్నాయని మండిపడ్డారు. వరవరరావును తక్షణం విడుదల చేసి, వైద్య సేవలు అందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. . 

Updated Date - 2020-07-14T09:03:51+05:30 IST