తెలంగాణకు స్వచ్ఛ అవార్డు ప్రదానం

ABN , First Publish Date - 2020-10-03T09:20:25+05:30 IST

స్వచ్ఛ భారత్‌ సర్వేలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌

తెలంగాణకు స్వచ్ఛ అవార్డు ప్రదానం

హైదరాబాద్‌, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్‌ సర్వేలో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణకు కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ అవార్డును అందజేశారు. గాంధీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చువల్‌ విధానంలో తెలంగాణ పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా దీనిని అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ కమిషనర్‌ రఘునందన్‌రావు, స్వచ్ఛ భారత్‌ రాష్ట్ర మిషన్‌ డైరెక్టర్‌ ఎస్‌.దిలీ్‌పకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వరుసగా మూడేళ్లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవడం గమనార్హం. కాగా, జిల్లాల కేటగిరిలో జాతీయ స్థాయిలో కరీంనగర్‌ మూడవ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-10-03T09:20:25+05:30 IST