సూర్యాపేటలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-07-09T01:45:56+05:30 IST
జిల్లా పరిధిలో ఇవాళ్ల 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 136కి చేరింది. యాక్టివ్ కేసులు 47 ఉన్నాయి. కరోనాతో జిల్లాలో ఇప్పటి వరకు

సూర్యాపేట: జిల్లా పరిధిలో ఇవాళ్ల 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 136కి చేరింది. యాక్టివ్ కేసులు 47 ఉన్నాయి. కరోనాతో జిల్లాలో ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇవాళ ఒక్క రోజే 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లా మొత్తంగా ఇప్పటి వరకు 33 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం 11 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇద్దరు కరోనా బాధితులు చనిపోయారు.