పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
ABN , First Publish Date - 2020-09-18T22:54:51+05:30 IST
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని
హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, చాలా చోట్ల మోస్తరు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఎల్లుండి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
వర్షం ఉధృతి తగ్గిందే తప్ప శాంతించలేదు. రైతన్నల ఆందోళన పోలేదు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. నీట మునిగిన వరి, కంది, పత్తి, జొన్న, మొక్కజొన్న, మిర్చి, వేరుశనగ, ఆముదం తదితర పంటలను చూసి రైతుల గుండె చెరువైంది. పాడుబడ్డ ఇళ్లు కూలాయి. వాకిళ్లలో మోకాలిలోతులో నీళ్లు చేరుతున్నాయి. చెరువులకు గండ్లు పడ్డాయి.