సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్కు కరోనా పరీక్షలు
ABN , First Publish Date - 2020-03-02T22:34:22+05:30 IST
ప్రముఖ సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి.

హైదరాబాద్: ప్రముఖ సామాజిక సేవకురాలు సునీతా కృష్ణన్కు గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు జరిగాయి. పరీక్షలు పూర్తయ్యాయని.. ఫలితాల గురించి ఎదురుచూస్తున్నట్టు ఆమె ట్విట్టర్ వేదికగా తెలిపారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన తాను దగ్గుతో బాధపడుతున్నానని.. ఈ మేరకు పరీక్షల నిమిత్తం హాస్పిటల్కు వెళ్లానన్నారు. తనపై వస్తున్న ఎలాంటి ఫేక్ వార్తలను నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ (కోవిడ్-19) తెలంగాణలోకి ప్రవేశించింది. భారత్లో ఐదు కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్యఆరోగ్యశాఖ ప్రకటించింది. దుబాయ్ నుంచి హైదరాబాద్కి వచ్చిన ఓ వ్యక్తికి కరోనా వైరస్ ఉందని పేర్కొంది. అలాగే ఢిల్లీలో మరో వ్యక్తికి కరోనావైరస్ సోకిందని తెలిపింది. కరోనావైరస్ సోకిన ఢిల్లీ వ్యక్తి ఇటలీ నుంచి వచ్చాడని పేర్కొంది. అలాగే ఇతరులకు చికిత్స అందిస్తున్నారు. ఆదివారం రోజున దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐదుగురికి కోవిడ్-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్గా తేలగా.. మరొకరికి పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు.