సునీల్ రెడ్డి హత్య దారుణం: జర్నలిస్ట్ సంఘాలు

ABN , First Publish Date - 2020-03-03T04:42:34+05:30 IST

ములుగు: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు.

సునీల్ రెడ్డి హత్య దారుణం: జర్నలిస్ట్ సంఘాలు

ములుగు: వరంగల్ ప్రెస్ క్లబ్ కోశాధికారి, జర్నలిస్ట్ బొమ్మినేని సునీల్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ములుగు జిల్లా కేంద్రంలో సునీల్‌తో పాటు దేవేందర్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా దుండగులు నరికారు. మరోవైపు సునీల్ రెడ్డి దారుణ హత్యను జర్నలిస్ట్ సంఘాలు ఖండించాయి. పథకం ప్రకారమే దుండగులు సునీల్ రెడ్డిని హత్య చేశారని ఐజేయూ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, టీయుడబ్ల్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శేఖర్, కె.విరాహత్ అలీ, ఉప ప్రధాన కార్యదర్శి విష్ణుదాస్ శ్రీకాంత్ విడుదల చేసిన ఓ ప్రకటనలో ఆరోపించారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. 

Updated Date - 2020-03-03T04:42:34+05:30 IST