ఆటో ఫైనాన్సర్ల దాడులు ఆపండి

ABN , First Publish Date - 2020-11-03T07:09:30+05:30 IST

కిస్తీలు చెల్లించని ఆటో రిక్షాలను ఆటో ఫైనాన్సర్లు సీజ్‌ చేస్తున్నారని, వారి దాడులను ఆపాలని తెలంగాణ

ఆటో ఫైనాన్సర్ల దాడులు ఆపండి

 హోం మంత్రికి ఆటో డ్రైవర్ల వినతి

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కిస్తీలు చెల్లించని ఆటో రిక్షాలను ఆటో ఫైనాన్సర్లు  సీజ్‌ చేస్తున్నారని, వారి దాడులను ఆపాలని తెలంగాణ ఆటో మోటార్‌ డ్రైవర్స్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు సోమవారం హోం మంత్రి మహమూద్‌ అలీని కలిసి వినతి పత్రం అందజేశారు. హోంమంత్రి కార్యాలయంలో నాయకులు ఎ.సత్తిరెడ్డి, వేము ల మారయ్య, సీహెచ్‌.సాయికుమార్‌  మంత్రిని కలిసి తమ ఇబ్బందులను వివరించారు.


కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందు లు ఎదుర్కొంటున్న సమయంలో ఇలా చేయడం దారుణమన్నారు. ఆటోలను సీజ్‌ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ అనుమతి లేని ఫైనాన్స్‌ సంస్థల కార్యకలాపాలను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2020-11-03T07:09:30+05:30 IST