దుబ్బాకలో బీజేపీదే గెలుపు: బండి సంజయ్

ABN , First Publish Date - 2020-11-04T02:05:39+05:30 IST

ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే గెలుపు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.5 వేల నుంచి 10వేలు పంచారని తెలిపారు. ఓటింగ్ కూడా జరగకుండా టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని

దుబ్బాకలో బీజేపీదే గెలుపు: బండి సంజయ్

హైదరాబాద్: ఎన్ని కుట్రలు చేసినా దుబ్బాకలో బీజేపీదే గెలుపు అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.  టీఆర్‌ఎస్‌ నేతలు ఓటుకు రూ.5 వేల నుంచి 10వేలు పంచారని తెలిపారు. ఓటింగ్ కూడా జరగకుండా టీఆర్‌ఎస్‌ కుట్ర చేసిందని ఆరోపించారు. పోలింగ్‌ శాతం పెరగడం బీజేపీకి సానుకూల అంశం అని చెప్పారు. టీఆర్‌ఎస్‌ అబద్దాలను ప్రచారం చేసిందన్నారు. మంత్రులకు అహంకారం తలకెక్కిందని ధ్వజమెత్తారు. ఇక గ్రేటర్‌ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని బండి సంజయ్‌ వెల్లడించారు.

Updated Date - 2020-11-04T02:05:39+05:30 IST