నిలిచిన ‘పుష్ప’ సినిమా షూటింగ్
ABN , First Publish Date - 2020-12-03T07:58:00+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో నిరవధికంగా సాగుతున్న అల్లు అర్జున్ ‘

అనారోగ్యంతో యూనిట్ సభ్యుడి మృతి
మారేడుమిల్లి, డిసెంబరు 2: తూర్పుగోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం తూర్పు మన్యంలో నిరవధికంగా సాగుతున్న అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమా షూటింగ్ బుధవారం నుంచి నిలిచిపోయింది.
చిత్ర యూనిట్కు చెందిన సభ్యుడొకరు అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందడం, తర్వాత యూనిట్లో పలువురికి వైద్య పరీక్షలు చేయగా కొవిడ్ లక్షణాలు కనిపించడంతో షూటింగ్ను నిలిపేశారని ప్రచారం జరుగుతోంది.