‘ఫాలున్ గాంగ్’ చైనా ఊచకోతకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమం

ABN , First Publish Date - 2020-12-10T23:09:57+05:30 IST

చైనా ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని పాశవికపు సంఘటన.. ఫాలున్ దఫా. చైనా కేంద్రంగా 1999లో జరిగిన అత్యతం దారుణ ఊచకోత నిదర్శనమే ఈ ఫాలున్ దఫా. ఫాలున్ గాంగ్ విధానాలను అనుసరించే వారిని ప్రభుత్వమే బహిరంగంగా అత్యంత దారుణంగా హతమార్చిన...

‘ఫాలున్ గాంగ్’ చైనా ఊచకోతకు నిరసనగా ప్రత్యేక కార్యక్రమం

హైదరాబాద్: చైనా ప్రజలు ఎన్నటికీ మరచిపోలేని పాశవికపు సంఘటన ఫాలున్ దఫా సభ్యులపై 1999లో జరిగిన అత్యంత దారుణ ఊచకోత. ఫాలున్ గాంగ్ విధానాలను అనుసరించే వారిని ప్రభుత్వమే బహిరంగంగా అత్యంత దారుణంగా హతమార్చిన ఘటన అది. ఫాలున్ గాంగ్ అనే ఈ శాంతియుత జీవన విధానాన్ని అవలంబించడాన్ని వ్యతిరేకించిన చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం ఆ విధానాన్ని పాటించే వారిని అణచివేసింది. అందరూ చూస్తుండగా వేలాది మంది ప్రాణాలను బలిగొంది. ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా చైనా పాలకులు చేసిన ఆ దారుణ ఘటనను గుర్తు చేసుకున్నారు హైదరాబాద్ ఫాలున్ దఫా నిర్వాహక కార్యదర్శి సుబ్రహ్మణ్యం. ఆ పాశవికపు ఘటనకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ మేరకు ఈస్ట్-మారేడ్‌పల్లి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పాంప్లేట్లు పంచి పెట్టారు.


ఈ సందర్భంగా సుబ్రమ్మణ్యం మాట్లాడుతూ, ఇప్పటికీ చైనాలో ఫాలున్ గాంగ్ సభ్యులపై జరుగుతున్న దాడులు జరుగుతూనే ఉన్నాయని, అంతర్జాతీయంగా దీనిపై ప్రజలంతా గొంతు విప్పాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అంతేకాకుండా తాను ఫాలున్ గాంగ్ గురించి వివరించినప్పుడు, ప్రజలతో పాటు డాక్టర్లు కూడా షాక్‌కు గురయ్యారని తెలిపారు. ఇదిలా ఉంటే ఫాలున్ గాంగ్‌ జీవిత విధానాన్ని అవలంబిస్తున్న వారు ప్రజలకు దానిపై అవగాహన పెంచారు. పాలున్ గాంగ్ జీవిత విధానం ఎంతో ప్రశాంతమైందని, విశ్వ నియమాలకు, స్వచ్ఛతకు, దాతృత్వానికి, ఓర్పుకు నిదర్శనమని వివరించారు.


ఫాలున్ దాఫా సభ్యులపై చైనాలో 1999 నుంచి సాగుతున్న ఈ మారణ హోమం 2006 దాకా వెలుగులోకి రాకపోవడం విశేషం. ఈ విషయంలో చైనా ప్రభుత్వం అక్కడి మీడియాను, మానవ హక్కుల సంఘాలను నియంత్రించింది. తొలుత 'ఫాలున్ గాంగ్‌'ను ప్రోత్సహించిన చైనా కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆ తర్వాత వారి విషయంలో నిర్దయగా వ్యవహరించసాగింది. నిజానికి ఫాలున్ గాంగ్ అనేది ఒక వర్గం బౌద్దుల సమూహం. వీరు నృత్యం, యోగా మొదలైనవి సాధన చేస్తూ, శాంతియుత జీవనాన్ని కొనసాగిస్తుంటారు. రోజురోజుకు ఫాలున్ గాంగ్ పరిధి విస్తరిస్తుండటంతో చైనా కమ్యూనిస్ట్ నేతలు ఉలిక్కిపడ్డారు. ఫాలున్ గాంగ్ బలపడితే అది ప్రభుత్వానికి కూడా ప్రమాదమని భావించారు. దీంతో ఫాలున్ గాంగ్ సభ్యులను జైళ్లలో బంధించారు. వారి నుంచి బలవంతంగా అవయవాలను తొలగించి, వివిధ వైద్య సంస్థలకు, పలు దేశాలకు వాటిని సరఫరా చేయడం ప్రారంభించారు. ఖైదీల అవయవాలను తొలగించడానికి ముందు వారి చేత రోజుకు 16 గంటల పాటు కఠినంగా పనిచేయిస్తారు. అనంతరం రక్త పరీక్షలు నిర్వహించి, వాటి ఆధారంగా అవయవాలను వర్గీకరిస్తారు. తరువాత అవయవాలను శరీరం నుంచి వేరు చేసి తరలిస్తారు.

చైనాలో ప్రతీరోజూ 160మంది ఖైదీలను అవయవాల కోసం హతమారుస్తుంటారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎక్కడా లేని రీతిలో చైనాలో అవయవ మార్పిడులు జరుగుతున్నాయి. ఇక్కడ ఏటా లక్ష వరకు అవయవ మార్పిడి ఆపరేషన్లు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతో చైనా అవయవ మార్పిడికి సంబంధించిన దేశంలా మారిపోయింది. మరోవైపు జపాన్‌లోని ఆరోగ్య బీమా సంస్థలు విదేశాల్లో నిర్వహించే శస్త్రచికిత్సలకు బీమాను వర్తింప చేస్తుండటంతో చైనాకు వస్తున్నవారి సంఖ్య పెరిగిపోతోంది. గతంలో ఇజ్రాయెల్‌ నుంచి కూడా అవయవాలకోసం ఇక్కడికి తరలి వచ్చేవారు. అయితే 'ఫాలున్ గాంగ్‌' ఉదంతం బయటకు వచ్చిన నేపధ్యంలో ఇలాంటి సందర్భాల్లో ఎలాంటి బీమా వర్తింపజేయకుండా ప్రత్యేక చట్టం చేసింది. దీంతో ఇజ్రాయెల్‌ ప్రజలు చైనా రావడం మానేశారు. జపాన్‌లో కూడా ఇటువంటి చట్టాలు రానున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-12-10T23:09:57+05:30 IST