కరోనా విషయంలో తెలంగాణకు నేడు స్వల్ప ఊరట

ABN , First Publish Date - 2020-04-25T00:17:46+05:30 IST

కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఈ రోజు కేవలం 14 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు

కరోనా విషయంలో తెలంగాణకు నేడు స్వల్ప ఊరట

హైదరాబాద్: కరోనా మహమ్మారి నుంచి తెలంగాణకు శుక్రవారం కాస్త ఊరట లభించింది. ఈ రోజు కేవలం 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో కలిపి తెలంగాణలో 983కి కరోనా పాజిటివ్‌ కేసులు చేరాయి.ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కరోనా కేసులు కనిష్టంలోకి పడిపోతున్నాయి. రాష్ట్రంలో ఆశాజనక పరిస్థితితులు కనిపిస్తున్నాయి. గురువారం మంత్రి ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ నాలుగైదు రోజుల్లో కేసులు ఇంకా తగ్గుముఖం పడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన అన్నట్లుగానే... కరోనా కేసుల సంఖ్య తగ్గుతోంది. గురువారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. 


20వ తేదీ (సోమవారం) నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. 20 తేదీ కూడా 14 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అయితే మంగళవారం ఒక్కరోజే 56 కేసులు నమోదయ్యాయి. బుధవారం 15 కేసులు నమోదయినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ కేసులు కూడా జీహెచ్‌ఎంసీలో 10, సూర్యాపేటలో 3, గద్వాలలో 2 కరోనా పాజిటివ్‌లు వచ్చాయి. గురువారం 27 కరోనా పాజిటివ్‌ కేసులు, ఒకరు మృతి చెందారు. శుక్రవారం కూడా 13 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసులను పరిశీలిస్తే మంగళవారం ఒక్క రోజును మినహాయిస్తే మిగిలిన రోజుల్లో కేసుల సంఖ్య కనిష్టంలోకి పడిపోయింది. కేసులు సంఖ్య తగ్గముఖం పట్టడంతో తెలంగాణ సమాజం ఆనందం వ్యక్తం చేస్తోంది. 

Updated Date - 2020-04-25T00:17:46+05:30 IST