ఆ ఉపాధ్యాయుల వివరాలను... పది లోగా...
ABN , First Publish Date - 2020-06-04T16:01:47+05:30 IST
రాష్ట్రంలో 2004 కు ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తర్వాత కొలువులో చేరిన వారి వివరాలను ఈ నెల 10 లోపు పంపాలని జిల్లా విద్యా శాఖాధికారులను సమగ్ర శిక్షా అభియాన్ సహాయ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు పీవీ శ్రీహరి ఆదేశించారు.
![ఆ ఉపాధ్యాయుల వివరాలను... పది లోగా...](https://media.andhrajyothy.com/appimg/galleries/2020060410282291/06042020103115n55.jpg)
హైదరాబాద్ : రాష్ట్రంలో 2004 కు ముందు ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికై ఆ తర్వాత కొలువులో చేరిన వారి వివరాలను ఈ నెల 10 లోపు పంపాలని జిల్లా విద్యా శాఖాధికారులను సమగ్ర శిక్షా అభియాన్ సహాయ రాష్ట్ర ప్రాజెక్టు సంచాలకుడు పీవీ శ్రీహరి ఆదేశించారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం 2003 డీఎస్సీ ద్వారా ఎంపికైన వారి వివరాలను ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయుల నుంచి డీఈవోలు తెప్పించుకొని సమర్పించాలని ఆయన సూచించారు. కొద్ది నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం వారిని పాత పింఛను పథకం పరిధిలోకి రానున్నారు. వారికి ఆ పథకాన్ని వర్తింపజేసేందుకే ఈ వివరాలు సేకరిస్తున్నారు.