కూరగాయల కొరత ఉందని అంటున్నారు.. కానీ..

ABN , First Publish Date - 2020-04-07T16:36:35+05:30 IST

కూరగాయల సప్లైకి తగిన డిమాండ్ లేదా? మార్కెట్‌లోకి ..

కూరగాయల కొరత ఉందని అంటున్నారు.. కానీ..

హైదరాబాద్: కూరగాయల సప్లైకి తగిన డిమాండ్ లేదా? మార్కెట్‌లోకి దిగిన కూరగాయలు పూర్తి స్థాయిలో అమ్ముడుకావడంలేదా? కరోనా సందర్భంగా లాక్ డౌన్ వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఇవి ఎటువైపు దారితీయబోతున్నాయి... లాక్ డౌన్ వల్ల అంతా ఇంటికే పరిమితమయ్యారు. మాంసాహారం తింటే కరోనా వస్తుందన్న భయంతో దానికి డిమాండ్ తగ్గిందంటున్నారు. మరి ఇదే సమయంలో కూరగాయలకు డిమాండ్ పెరగాలికదా? కానీ ఆ పరిస్థితి లేదని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. సప్లయ్‌కి తగిన డిమాండ్ లేదని చెబుతున్నారు. లాక్ డౌన్ వల్ల భారీగా కొనుగోలు చేస్తున్నారని.. కూరగాయల కొరత ఉందని అంతా అనుకుంటున్నారు కానీ వాస్తవ పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయన్నా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఒక్క తెలంగాణను తీసుకుంటే రోజుకు 30 లక్షల టన్నుల కూరగాయలు పండుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాలే కాకుండా హోటళ్లు పూర్తి స్థాయిలో నడిస్తే సుమారు 25 లక్షల టన్నుల కూరగాయలు తెలంగాణకు అవసరమవుతాయి. మిగిలిన 5 లక్షల టన్నుల కూరగాయలు ఏపీ, కర్ణాటకకు ఎగుమతి అవుతాయి. ఇది ఓ దేశవాళి అంచన. అయితే ఇప్పుడు కరోనా దెబ్బకు ఎగుమతులులేవు. హోటల్స్ నడవడంలేదు. కొనేవారి సంఖ్య భారీగా తగ్గింది. దీంతో అవసరమైనదానికన్నా ఎక్కువ కూరగాయలు మార్కెట్‌లో ఉండిపోతున్నాయి. డిమాండ్ తగ్గడం ఓ కారణమైతే.. లాక్ డౌన్ వల్ల ఇంటివద్దకే వ్యాన్‌లలో కూరగాయలు తీసుకువచ్చి అమ్ముతుండడంతో మార్కెట్‌కు వెళ్లేవారి సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో మార్కెట్లు వెలవెలబోతున్నాయి. 

Updated Date - 2020-04-07T16:36:35+05:30 IST