పీవీ సింధు ఛాలెంజ్.. మొక్కలు నాటిన సానియా మీర్జా
ABN , First Publish Date - 2020-06-23T03:39:15+05:30 IST
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్ను..

హైదరాబాద్: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇచ్చిన ఛాలెంజ్ను టెన్నిస్ స్టార్ సానియా మీర్జా స్వీకరించారు. సోమవారం ఫిలింనగర్లోని తన కార్యాలయం ఆవరణంలో మొక్కలు నాటారు. ఇండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు ఆమె ఛాలెంజ్ చేశారు. మొక్కలు నాటాలని కోరారు. ఈ సందర్భంగా సానియా మీర్జా మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. దీనివల్ల ప్రకృతిని రక్షించుకోవచ్చని చెప్పారు. ఈ ఛాలెంజ్లో మొక్కలు నాటడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని సానియా మీర్జా తెలిపారు.
