సంగారెడ్డిలో కరోనా విజృంభణ
ABN , First Publish Date - 2020-06-23T01:21:02+05:30 IST
సంగారెడ్డిలో కరోనా విజృంభణ

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు నియోజకవర్గంలో కరోనా విజృంభిస్తోంది. ఒకే రోజు 11 కరోనా కేసులు వెలుగు చూశాయి. బీడీఎల్ భానూర్లోని ఓ టౌన్ షిప్లో ఎనిమిది మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అలాగే పటాన్చెరులో ఒకరు కరోనా బారిన పడ్డారు. బీహెచ్ఈఎల్ న్యూ ఎమ్ఐజీలో రెండు పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.