సీఐ జగదీశ్‌ బ్యాంకు లాకర్‌లో రూ.34 లక్షలు

ABN , First Publish Date - 2020-11-26T08:08:28+05:30 IST

కామారెడ్డి పట్ట ణ సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతోన్న నేపథ్యంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

సీఐ జగదీశ్‌ బ్యాంకు లాకర్‌లో రూ.34 లక్షలు

182 గ్రాముల బంగారం, ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్‌ చేసిన ఏసీబీ

కామారెడ్డి, నవంబరు 25: కామారెడ్డి పట్ట ణ సీఐ జగదీశ్‌ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతోన్న నేపథ్యంలో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. బుధవారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని యాక్సిస్‌ బ్యాంక్‌లో ఆయనకు చెందిన లాకర్‌ను ఏసీబీ అధికారులు ఓపెన్‌ చేశారు. రూ.34,40,200 నగదు, రూ.9,12,800 విలువ గల 182.560 గ్రాముల బంగారు నగలు, 15.7 గ్రాముల వెండి నగలతో పాటు పలు ఆస్తుల డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది.


ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వాహకుల నుంచి డబ్బులు డిమాండ్‌ చేయడం వంటి అవినీతి ఆరోపణలతో జగదీశ్‌, మధ్యవర్తి సుజయ్‌లను ఏసీబీ అధికారులు రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. 


Updated Date - 2020-11-26T08:08:28+05:30 IST