సికింద్రాబాద్ మెట్టుగూడలో రౌడీషీటర్ హల్చల్
ABN , First Publish Date - 2020-05-28T16:03:06+05:30 IST
మెట్టుగూడలో రౌడీషీటర్ భాగ్యరాజ్ హల్చల్ సృష్టించాడు. మద్యం మత్తులో రౌడీషీటర్ వీరంగం చేశాడు. రాకేష్ అనే రైల్వే ఉద్యోగిపై దాడికి తెగబడ్డాడు
సికింద్రాబాద్: మెట్టుగూడలో రౌడీషీటర్ భాగ్యరాజ్ హల్చల్ సృష్టించాడు. మద్యం మత్తులో రౌడీషీటర్ వీరంగం చేశాడు. రాకేష్ అనే రైల్వే ఉద్యోగిపై దాడికి తెగబడ్డాడు. తీవ్రగాయలపాలైన రాకేష్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించారు. రౌడీషీటర్ను పట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించాడు.