కంటైనర్ను ఢీకొట్టిన బైక్
ABN , First Publish Date - 2020-12-13T14:57:09+05:30 IST
కంటైనర్ను ఢీకొట్టిన బైక్

సంగారెడ్డి: జిల్లాలోని పటాన్చెరు మండలం ముత్తంగి దగ్గర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. కంటైనర్ను బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఓ మేక అక్కడికక్కడే మృతి చెందింది. తెల్లవారుజామున రెండు గంటలకు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.