పెరుగుతున్న ఉష్ణోగ్రత

ABN , First Publish Date - 2020-10-04T07:44:50+05:30 IST

నైరుతి రుతు పవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి.

పెరుగుతున్న ఉష్ణోగ్రత

హైదరాబాద్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): నైరుతి రుతు పవనాలు నిష్క్రమించడంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో పలు చోట్ల 30 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌లో 34.8, నిజామాబాద్‌లో 34.6, ఖమ్మంలో 33.6, మెదక్‌లో 33.2, రామగుండంలో 33, హైదరాబాద్‌లో 32.8, భద్రాచలంలో 32.6, నల్లగొండలో 31.5, హకీంపేటలో 31.4, దుండిగల్‌లో 31, మహబూబ్‌నగర్‌లో 30.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి రుతు పవనాలు పూర్తిగా బలహీనపడ్డాయని, వచ్చే 5 రోజుల పాటు అక్కడక్కడా చిరు జల్లులు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

Updated Date - 2020-10-04T07:44:50+05:30 IST