నేటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు
ABN , First Publish Date - 2020-04-01T12:06:02+05:30 IST
నేటి నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు

హైదరాబాద్(ఆంధ్రజ్యోతి): రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి.. అందుకుతగ్గ ఏర్పాట్ల మధ్య రాష్ట్రంలో బుధవారం నుంచి వరి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి. మొత్తం 6,695 కేంద్రాలను నెలకొల్పగా.. 77.73 లక్షల టన్నుల వరి ధాన్యం కొనుగోలుకు వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. రైతుల డిమాండ్, అవసరాన్ని బట్టి మరిన్ని కేంద్రాలు అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటించింది.