‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

ABN , First Publish Date - 2020-04-30T09:44:57+05:30 IST

రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, తెలంగాణ జల నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావుకు ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.

‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ

ఇదే విద్యాసాగర్‌రావుకు నిజమైన నివాళి: కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ‘రైస్‌బౌల్‌ ఆఫ్‌ ఇండియా’గా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని, తెలంగాణ జల నిపుణుడు ఆర్‌.విద్యాసాగర్‌రావుకు ఇచ్చే నిజమైన నివాళి ఇదేనని సీఎం కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. విద్యాసాగర్‌రావు 3వ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయనకు సీఎం నివాళి అర్పించారు. సమైక్యపాలనలో సాగునీటి విషయమై తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించి ప్రజల్లో స్వరాష్ట్ర కాంక్షను రగిలించారని విద్యాసాగర్‌రావును కొనియాడారు. ఆయన ఆశయాలకనుగుణంగా  సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. విద్యాసాగర్‌రావు స్ఫూర్తితో కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ ఇంజనీర్లు ఆవిష్కరించారని చెప్పారు.

Updated Date - 2020-04-30T09:44:57+05:30 IST