గుళ్లలో ఆర్జిత సేవలపై ఆంక్షలు?
ABN , First Publish Date - 2020-03-19T09:54:23+05:30 IST
కరోనా వైర్సను ప్రాథమిక దశలోనే కట్టడి చేయడానికి రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉగాది, శ్రీరామనవమి,
![గుళ్లలో ఆర్జిత సేవలపై ఆంక్షలు?](https://www.andhrajyothy.com/assets/images/defaultImg.jpeg)
కరోనా కట్టడికి కఠిన చర్యలు.. అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష
హైదరాబాద్/యాదాద్రి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వైర్సను ప్రాథమిక దశలోనే కట్టడి చేయడానికి రద్దీ ఎక్కువగా ఉండే ప్రధాన ఆలయాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఉగాది, శ్రీరామనవమి, వేసవి సెలవుల కారణంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొననున్నందున కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్, దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ప్రధాన ఆలయాల ఈవోలు సమావేశమయ్యారు.
కరోనా ప్రభావం తగ్గేవరకు ఆలయాల్లో ఆర్జిత సేవలపై ఆంక్షలు విధించాలని దేవాదాయ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే ఆలయాల్లో ఆంక్షలను సీఎం కేసీఆర్ ఆమోదం మేరకు అమలు చేస్తామని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. యాదాద్రి ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా తగ్గింది. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లోకి విదేశీ భక్తుల ప్రవేశాన్ని నిషేధిస్తూ దేవాదాయ శాఖ నిర్ణయం తీసుకుంది.