సీపీఎస్కు వ్యతిరేకంగా తీర్మానం చేయాలి: సంఘం
ABN , First Publish Date - 2020-03-02T10:26:36+05:30 IST
కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానానికి(సీపీఎ్సకు) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న

కవాడిగూడ, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కాంట్రిబ్యూటరీ పింఛన్ విధానానికి(సీపీఎ్సకు) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్న సీపీఎస్ నిరసన దీక్షలో వివిధ రాష్ట్రాల ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు చిలగాని సంపత్కుమార్ మాట్లాడుతూ సీపీఎస్ రద్దయ్యేదాకా పోరాటం ఆగదన్నారు.