రిలయన్స్ జియోకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ABN , First Publish Date - 2020-02-08T20:56:30+05:30 IST
హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ అందించే ప్రతిష్ఠాత్మక ‘ది హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’కు రిలయన్స్ జియో ఎంపికైంది.

హార్ట్ఫుల్నెస్ ఇనిస్టిట్యూట్ అందించే ప్రతిష్ఠాత్మక ‘ది హార్ట్ఫుల్నెస్ ఆర్గనైజేషన్ అవార్డు’కు రిలయన్స్ జియో ఎంపికైంది. నగరంలోని కన్హా శాంతివనంలో శనివారం ఈ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి అవార్డును అందుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 130 దేశాలలో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ సేవలు అందిస్తోంది. ఈ ఏడాదితో హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ 75 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా, తన భాగస్వామి సంస్థలను ‘ది హార్ట్ఫుల్ ఆర్గనైజేషన్ అవార్డు’తో సత్కరించింది.
ఉద్యోగుల శ్రేయస్సును ప్రోత్సహించడానికి హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్తో భాగస్వామ్యం కలిగిన ప్రపంచవ్యాప్తంగా 1200కి పైగా సంస్థలలో 10 ఉత్తమ కంపెనీలను ఎంపిక చేశారు. హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ భాగస్వామ్యంతో రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా ఉన్న 180కి పైగా తమ కార్యాలయాలలో 3 రోజుల వర్క్షాప్ నిర్వహించింది. ఈ వర్క్షాప్లో 3000 మందికి పైగా తమ ఉద్యోగులు పాల్గొన్నారని జియో తెలిపింది.