లక్ష్మీ బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల
ABN , First Publish Date - 2020-11-21T10:20:37+05:30 IST
లక్ష్మీ బ్యారేజీ నుంచి కొనసాగుతున్న నీటి విడుదల

మహదేవపూర్ రూరల్, నవంబరు 20 : కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగుతోందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం బ్యారేజీలోకి 10 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరుతుండగా నాలుగు గేట్లను ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.