పెద్దచెరువులో కూల్చిన ఫెన్సింగ్ పునర్నిర్మాణం
ABN , First Publish Date - 2020-12-13T08:00:15+05:30 IST
సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్దచెరువు మత్తడి సమీపంలోని స్థలంలో కూల్చిన ఫెన్సింగ్ను సంబంధిత స్థల

చేర్యాల, డిసెంబరు 12: సిద్దిపేట జిల్లా చేర్యాల పెద్దచెరువు మత్తడి సమీపంలోని స్థలంలో కూల్చిన ఫెన్సింగ్ను సంబంధిత స్థల యాజమానులు రాత్రికిరాత్రే పునర్నిర్మించారు. శుక్రవారం నిర్వహించిన పట్టణ బంద్లో ప్రతిపక్షాల నేతలు ఆ ఫెన్సింగ్ను కూల్చివేసిన విషయం తెలిసిందే.
ఆందోళన అనంతరం ప్రతిపక్షాల నేతలను పోలీసులు అరెస్ట్ చేసి పోలీ్సస్టేషన్కు తరలించగా, స్థల యజమాని మారుతీ ప్రసాద్, టీఆర్ఎస్ నేతలు ఫెన్సింగ్ పనులను తిరిగి చేపట్టారు. పోలీసుల పర్యవేక్షణలో పనులు పూర్తిచేశారు.