రాముడి జీవితం నవ తరానికి ప్రేరణ
ABN , First Publish Date - 2020-11-07T07:21:02+05:30 IST
సత్యవాక్కు పరిపాలకుడైన రాముడి జీవితం నుంచి నవతరం ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు.
![రాముడి జీవితం నవ తరానికి ప్రేరణ](https://media.andhrajyothy.com/appimg/galleries/20201107011431/11072020015055n62.jpg)
తవాస్మి పుస్తకావిష్కరణలో వెంకయ్య
న్యూఢిల్లీ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): సత్యవాక్కు పరిపాలకుడైన రాముడి జీవితం నుంచి నవతరం ప్రేరణ పొందాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. రచయిత రాళ్లబండి శ్రీరామచక్రధర్, సహ రచయిత అమర శారదాదీప్తి రచించిన ‘‘తవాస్మి-రామాయణ స్పూర్తితో సానుకూల జీవితం, నైపుణ్యం’’ పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి శుక్రవారం ఆన్లైన్ ద్వారా ఆవిష్కరించి మాట్లాడారు.
సత్యం, ధర్మం, విలువలు, నైతికతల కలబోత అయిన రాముడి జీవితాన్ని ప్రతిఒక్కరూ చదివి తమ జీవితాలకు అన్వయించుకొని ఆచరించాలని పేర్కొన్నారు. చిన్నారులకు నిద్రపోయే ముందు కథలు చెప్పే అలవాటు క్రమంగా కనుమరుగవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రామాయణం, మహాభారతం వంటి కావ్యాలు, నీతి కథలను తెలుసుకుంటే బాల్యం నుంచే నైతిక విలువలు పెంపొందుతాయని చెప్పారు.