ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శిగా రాంబాబు

ABN , First Publish Date - 2020-11-03T10:12:37+05:30 IST

రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాట సదయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు

ఎస్టీయూ జిల్లా ప్రధానకార్యదర్శిగా రాంబాబు

వరంగల్‌ అర్బన్‌ ఎడ్యుకేషన్‌, నవంబరు 2: రాష్ట్రోపాధ్యాయ సంఘం (ఎస్టీయూ) వరంగల్‌ అర్బన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా వేమునూరి రాంబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు యాట సదయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా ఉన్న లక్ష్మీనర్సయ్య పదవీ విరమణ పొందడంతో సంఘం రాష్ట్ర బాధ్యుడు భీమనాధుని రవి సమక్షంలో రాంబాబును జిల్లా ప్రధానకార్యదర్శిగా ఎన్నుకున్నట్లు సదయ్య తెలిపారు. 

Updated Date - 2020-11-03T10:12:37+05:30 IST