‘రైతుబంధు’ పాత బకాయిల చెల్లింపు: సీఎం
ABN , First Publish Date - 2020-06-18T09:32:33+05:30 IST
‘రైతుబంధు’ పాత బకాయిల చెల్లింపు: సీఎం
హైదరాబాద్, జూన్ 17 (ఆంధ్రజ్యోతి): ‘రైతుబంధు’ పాత బకాయిలు కూడా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత సీజన్కు సంబంధించి జరిపిన చెల్లింపులు పోను, లబ్ధిదారులైన రైతులతో పాటు, అటవీ హక్కుల గుర్తింపు పట్టాదారులకు కలిపి రూ.5 వేల కోట్ల వరకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. ప్రస్తుతం వానాకాల పంటకు పెట్టుబడి సాయంగా ప్రభుత్వం రైతుబంధు నిధులు విడుదల చేస్తున్న క్రమంలో పాత బకాయిల విషయాన్ని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే రైతుబంధు కింద వానాకాల పంట పెట్టుబడి సాయం అందించిన తర్వాతే పాత బకాయిలు చెల్లిద్దామని ఆర్థిక శాఖ ఉన్నతాధికారులకు ఆయన స్పష్టత ఇచ్చారు. ఆలోగా బకాయిలు పొందాల్సిన లబ్ధిదారుల జాబితా రూపొందించాలని ఆదేశించారు