గల్ఫ్ కార్మికుల సమస్యలను లేవనెత్తుతా: నామా
ABN , First Publish Date - 2020-12-15T07:58:45+05:30 IST
గల్ఫ్కు తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులు అక్కడ ఎదుర్కొంటోన్న సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ లోకసభ పక్ష
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గల్ఫ్కు తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులు అక్కడ ఎదుర్కొంటోన్న సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని టీఆర్ఎస్ లోకసభ పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. వారి సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళతానని చెప్పారు.