వర్షాల ఎఫెక్ట్.. ఐదు రోజులు.. 59 భవనాల కూల్చివేత..!
ABN , First Publish Date - 2020-10-19T11:59:58+05:30 IST
వర్షాల నేపథ్యంలో గత ఏడు రోజుల్లో 59 శిథిల భవనాలు కూల్చివేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. వరదలు, వరుస వానల దృష్ట్యా.. పురాతన భవనాలు కూలే అవకాశం ఉందని, 33 శిథిల భవనాల్లో ఉన్న 140 మందిని ఖాళీ చేయించామన్నారు.

హైదరాబాద్ : వర్షాల నేపథ్యంలో గత ఏడు రోజుల్లో 59 శిథిల భవనాలు కూల్చివేసినట్టు జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేష్ కుమార్ తెలిపారు. వరదలు, వరుస వానల దృష్ట్యా.. పురాతన భవనాలు కూలే అవకాశం ఉందని, 33 శిథిల భవనాల్లో ఉన్న 140 మందిని ఖాళీ చేయించామన్నారు. మూసీ తీరంలో మంగళ్ హాట్లో నివసించే 35 మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని చెప్పారు. ప్రమాదకరంగా మారిన భవనాలను సీల్ చేయడంతోపాటు చుట్టూ బారికేడింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ యేడాది ఇప్పటి వరకు 545 భవనాలు శిథిలావస్థలో ఉన్నట్టు గుర్తించామని, వాటిలో 187 కూల్చివేయగా.. 127 భవనాలకు మరమ్మతు చేయించామన్నారు. ఇంకా ఎక్కడైనా శిథిల భవనాల్లో ప్రజలు ఉంటే గుర్తించి ఖాళీ చేయించాలని అధికారులను ఆదేశించారు. ప్రజలూ సహకరించాలని కమిషనర్ కోరారు.