కేంద్ర ఎన్నికల కమిషనర్కు రఘునందన్రావు ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-10-07T22:29:13+05:30 IST
కేంద్ర ఎన్నికల కమిషనర్, కేంద్రమంత్రికి అమిత్ షాకు దుబ్బాక దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. తన సిబ్బంది ఫోన్కాల్స్ని ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని

హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషనర్, కేంద్రమంత్రికి అమిత్ షాకు దుబ్బాక దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. తన సిబ్బంది ఫోన్కాల్స్ని ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తోందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫోన్ల ట్యాపింగ్పై విచారణ జరపాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్రావు ఆదేశాల మేరకు తెలంగాణ పోలీస్ విభాగం పనిచేస్తోందని రఘునందన్రావు ఆరోపించారు. అక్టోబర్ 5న జరిగిన సంఘటన ద్వారా ఇది రుజువైందని రఘునందన్రావు తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్రావునే ఆ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్.. దుబ్బాకకు రఘునందన్ పేరునూ ప్రకటించారు. ఇంతకుముందే రఘునందన్ అభ్యర్థిత్వంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం.. అధిష్ఠానానికి ఆయన ఒక్కడి పేరును మాత్రమే సిఫారసు చేసింది.