112 మంది రైలు ప్రయాణికుల హోం క్వారంటైన్
ABN , First Publish Date - 2020-05-24T09:33:41+05:30 IST
చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు నుం చి శనివారం వరంగల్ రైల్వేస్టేషన్లో 112 మంది ప్రయాణికులు దిగారు.
గిర్మాజిపేట, మే 23: చెన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని సూపర్ ఫాస్ట్ ప్రత్యేక రైలు నుం చి శనివారం వరంగల్ రైల్వేస్టేషన్లో 112 మంది ప్రయాణికులు దిగారు. వీరి వివరాలను వరంగ ల్ రైల్వేస్టేషన్ నోడల్ అధికారి, తహసీల్దార్ మహ్మద్ ఇక్బాల్ ఆధ్వర్యంలో రెవెన్యూ సిబ్బంది నమో దు చేసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నోడల్ అధికారి డాక్టర్ మదన్మోహన్రావు ఆధ్వర్యంలో ఽథర్మల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించారు.
అందరి చేతులపై 14 రోజుల పాటు హోంక్వారంటైన్ ముద్రలు వేసి ఇంటికి పంపించారు. ఇదే రైలులో వరంగల్ నుంచి న్యూఢిల్లీ వెళ్లిన 33 మంది ప్రయాణికుల కు వైద్య సిబ్బంది ఽథర్మల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం వరంగల్ ముఖ్య కమర్షియ ల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారిని రైలులోకి అనుమతించారు.