8 అడుగుల పీవీ కాంస్య విగ్రహం
ABN , First Publish Date - 2020-07-10T08:47:47+05:30 IST
8 అడుగుల పీవీ కాంస్య విగ్రహం

తెనాలి అర్బన్, జూలై 9: దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు విగ్రహాన్ని గుంటూరు జిల్లా తెనాలి శిల్పులు రూపుదిద్దారు. 8 అడుగుల ఎత్తున్న విగ్రహాన్ని 400 కిలోల కంచుతో తెనాలి పట్టణంలోని సూర్య శిల్పశాలలో తీర్చిదిద్దామని శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నాగర్కరూలుఉ జిల్లాలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు తమకు ఆర్డర్ వచ్చిందని పేర్కొన్నారు. విగ్రహ తయారీకి నెల రోజుల పట్టిందని చెప్పారు.