లాక్డౌన్ నేపథ్యంలో గోపీచంద్ ఆన్లైన్ కోచింగ్
ABN , First Publish Date - 2020-04-05T14:02:33+05:30 IST
లాక్డౌన్ నేపథ్యంలో క్రీడాకారులు కూడా బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో...

హైదరాబాద్ : లాక్డౌన్ నేపథ్యంలో క్రీడాకారులు కూడా బయటికి రావడానికి అవకాశం లేకపోవడంతో వారి శిక్షణ కార్యక్రమాలు మొత్తం నిలిచిపోయాయి. ఇలా అయితే, వారి ఫిట్నెస్తో పాటు ఆట లయ దెబ్బతింటుందని భావించిన భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆన్లైన్ క్లాసులు ప్రారంభించారు. వాట్సాప్లో ఒక గ్రూప్ ఏర్పాటు చేసి అగ్రశ్రేణి క్రీడాకారులందరికీ ఒక్కో తరహా మాడ్యూల్ను కేటాయించి ఇంట్లోనే సాధన చేయాల్సిందిగా గోపీ సూచించాడు.