పులిచింతల ప్రాజెక్ట్కు వరద ఉధృతి
ABN , First Publish Date - 2020-09-18T13:23:55+05:30 IST
ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.

సూర్యాపేట: ఎగువన కురుస్తున్న వర్షాలతో పులిచింతల ప్రాజెక్టుకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు 14 గేట్లు మూడు మీటర్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... ప్రస్తుత నీటి నిల్వ 45.30 టీఎంసీలుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి మట్టం 175.89 అడుగులకు గాను... ప్రస్తుత నీటి మట్టం 174.703 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ ఇన్ ప్లో 3,40,447 క్యూసెక్కులు, అవుట్ ప్లో 3,20,100 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.