తెలంగాణ నుంచి కారిడార్లకు ప్రతిపాదన లొచ్చాయి

ABN , First Publish Date - 2020-02-08T10:19:03+05:30 IST

హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌లకు తెలంగాణ నుంచి ప్రతిపాదనలొచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు.

తెలంగాణ నుంచి కారిడార్లకు ప్రతిపాదన లొచ్చాయి

డీఎస్‌ ప్రశ్నకు కేంద్ర మంత్రి గోయల్‌ సమాధానం

కొత్తూర్‌-గద్వాల్‌ కారిడార్‌ అభివృద్ధి చేయాలన్న టీఆర్‌ఎస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి7(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్‌లకు తెలంగాణ నుంచి ప్రతిపాదనలొచ్చాయని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చెప్పారు. శుక్రవారం ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. సాధ్యాసాధ్యాల తుది నివేదిక కోసం డీఎంఐసీడీసీ, టీఎ్‌సఐఐసీ అధికారులతో సమీక్షించినట్లు చెప్పారు. కాగా.. జాతీయ రహదారి- 44, 167 వెంట కొత్తూర్‌-గద్వాల్‌, కొత్తూర్‌-రాయచూర్‌ వరకు పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేయాలని గోయల్‌కు టీఆర్‌ఎస్‌ ఎంపీలు మన్నె శ్రీనివా్‌సరెడ్డి, పి.రాములు, వెంకటేశ్‌ నేత శుక్రవారం వినతిపత్రం ఇచ్చారు. దేవరకద్ర రైల్వే స్టేషన్‌లో తుంగభద్ర, కర్నూల్‌ ఇంటర్‌ సిటీ, హంద్రీ, వెంకటాద్రి ఎక్స్‌ప్రె్‌సలకు హాల్ట్‌ ఇవ్వాలని, పెద్దపల్లి నియోజకవర్గంలో ఆర్వోబీలు, ఎఫ్‌వోబీలు నిర్మించాలని కోరారు.

Updated Date - 2020-02-08T10:19:03+05:30 IST