ఖైదీలను బెయిలుపై విడుదల చేయాలి: రేవంత్
ABN , First Publish Date - 2020-03-24T10:14:06+05:30 IST
కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని

కరోనా వైరస్ వణికిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ఖైదీలను బెయిలుపై విడుదల చేయించేందుకు ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం సీఎం కేసీఆర్కు ఆయన బహిరంగ లేఖ రాశారు. కరోనా నేపథ్యంలో మార్చి 31 వరకు లాక్డౌన్ ప్రకటించారని, కానీ రాష్ట్రంలోని పలు జైళ్లలో వేల మంది ఖైదీలు ఒకేచోట ఉంటున్న విషయాన్ని విస్మరించారన్నారు. ఒక్క చర్లపల్లి జైలులోనే దాదాపు 2 వేల మంది ఖైదీలున్నారని, వీరికి తోడుగా జైలు సిబ్బంది మరో 2 వందల మంది వరకు ఉంటారని పేర్కొన్నారు.