కరోనా నియంత్రణకు ఏసీల వాడకాన్ని తగ్గించండి: సుదర్శన్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-03-27T19:00:55+05:30 IST

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఏసీల వాడకంపై నియంత్రణ ఉండాలని అధికారులు తెలిపారు.

కరోనా నియంత్రణకు ఏసీల వాడకాన్ని తగ్గించండి: సుదర్శన్‌రెడ్డి

హైదరాబాద్: కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ఏసీల వాడకంపై నియంత్రణ ఉండాలని అన్ని మునిసిపల్, అర్బన్ డెవలప్‌మెంట్‌లోని అన్ని విభాగాల అధికారులకు ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్‌రెడ్డి ఓ ప్రకటనను విడుదల చేశారు.


కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడే ప్రతి ఒక్క దానిపై నియంత్రణ ఉండాలన్నారు. దీనిలో భాగంగా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఏసీల వాడకాన్ని దాదాపు తగ్గించాలని కోరారు. ఆఫీసుల గదుల్లోకి వెలుతురు, గాలి వచ్చేలా కిటికీలను తెరచి ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు అత్యవసరమైతే తప్ప ఏసీలు వాడొద్దని అధికారులు తెలిపారు.

Updated Date - 2020-03-27T19:00:55+05:30 IST