మసీదులో ప్రార్థనలు.. కేసు నమోదు
ABN , First Publish Date - 2020-04-21T11:44:45+05:30 IST
మసీదులో ప్రార్థనలు.. కేసు నమోదు

ఇల్లెందుటౌన్: లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించి మసీదులో ప్రార్థన చేసిన 11 మందిపై భద్రాద్రి జిల్లా ఇల్లెందు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇల్లెందు పట్టణం ఇందిరానగర్లోని మసీదులో సోమవారం ఉదయం 5 గంటలకు వారు ప్రార్థన చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకోని 11 మందిపై కేసులు నమోదు చేశారు.