ఎన్పీఆర్, జనగణన తొలి దశ వాయిదా?
ABN , First Publish Date - 2020-03-23T09:22:40+05:30 IST
జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను అప్డేట్ చేయడం, జనగణన 2021 తొలి దశ ప్రక్రియ నిరవధికంగా వాయిదా

న్యూఢిల్లీ, మార్చి 22: జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను అప్డేట్ చేయడం, జనగణన 2021 తొలి దశ ప్రక్రియ నిరవధికంగా వాయిదా పడనుంది. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవ్వాల్సిన ఈ ప్రక్రియను కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ విషయమై అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.